అక్కినేని వారి కోడలు సమంత ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కుస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో బన్నీ కూతురు అల్లు అర్హ నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైరాబాద్లో వేసిర భారీ సెట్లో శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచరం ప్రకారం.. బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి శాకుంతలంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు వర్షిణి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేసిందట.
ఈ విషయన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. తాను నటించే పాత్ర ఏంటీ అన్నది క్లారిటీ అవ్వకపోయినా..పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో నటించే ఛాన్స్ రావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని పేర్కొంది. కాగా, వర్ణిణి టీవీ షోలతో పాటుగా మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.