టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తన మూవీ రీమేక్తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా..వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని షాజాదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఏక్తా కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కోసం అల్లు అర్జున్ని మేకర్స్ సంప్రదించగా.. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది. కాగా, సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.