వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రాల్లో దిశ ఎన్ కౌంటర్ ఒకటి. హైదరాబాద్లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ.
ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై నిర్మించారు. ఆనంద్ చంద్ర దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచారణలో సినిమా టైటిల్ ఆశ ఎన్ కౌంటర్ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు.
అంతేకాదు, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏప్రిల్ 16న ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, అభ్యంతరం ఉంటే సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ను సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవచ్చునని ధర్మాసనం సూచించారు. ఇక ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశిస్తూ.. అప్పీలుపై విచారణ ముగించింది.