‘ఆర్.ఆర్.ఆర్’ బ్యానర్ లో ‘మహేష్ సినిమా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పారట’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో మహేష్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మరోసారి చర్చల్లోకి వచ్చింది.

ప్రస్తుతం ‘ఆర్.ఆర్ ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య.. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. ‘భరత్ అనే నేను’ తర్వాత మహేష్ తో మరో సినిమాకి కమిట్మెంట్ ఉండటంతో.. వీరిద్దరి కలయికలో మూవీ సెట్ చేయడానికి దానయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం మహేష్ – ప్రశాంత్ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.