టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబోలో తెరకెక్కబోతోన్న తాజా చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై డా. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ భామగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్పూత్ ఆదితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అవును, కిరాతకలో పాయల్నే హీరోయిన్గా నటిస్తుందని దర్శకుడు వీరభద్రం కన్ఫార్మ్ చేశాడు.
అలాగే ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఆదికి గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. ఇటీవల విడుదలైన శశి చిత్రం కూడా బోల్తా పడింది. మరి కిరాతకతో అయినా ఆది సక్సెస్ అవుతాడో.. లేదో.. చూడాలి.