ప్ర‌ముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో భా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన‌ అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రైట్ డిజిటల్ రిలీజ్ కోసం భారీగా ఆఫ‌ర్ చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌ ఆ ఆఫ‌ర్ మాస్ట్రో మేక‌ర్స్ కూడా న‌చ్చ‌డంతో.. సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతేకాదు, దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.