అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర శివసేన నేత ఆనందరావు ఆద్సుల్ నవనీత్ కౌర్ పై బాంబే హైకోర్టులో ఆమె కుల ధృవీకరణ పత్రాలు నకిలీవి ఎన్నికల్లో సమర్పించిందని ఫిర్యాదుపైచేశారు. దీంతో బాంబే హైకోర్టు ఈ మేరకు విచారణ చేసి షాకింగ్ తీర్పు వెల్లడించింది.
బాంబే హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ నవనీత్ కౌర్కు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఆమె తన కుల సర్టిఫికెట్లు నకిలీవి కావని, సరైనవేనంటూ నిరూపించు కోవాలని, ఇందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఆమె ఎంపీ పదవిపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కోర్టు తీర్పుపై ఎంపీ స్పందిస్తూ తాను ఎల్లప్పుడూ కోర్టు తీర్పులను గౌరవిస్తానని చెప్పింది. ఇక ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ ప్రకటించారు ఆమె. సుప్పీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.