వరుస విషాదాలతో శాండల్ వుడ్ ఆందోళన చెందుతోంది. కరోనా అనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది శాండల్ వుడ్ ప్రముఖులు దూరమయ్యారు. ఇప్పటికీ దూరమవుతూనే ఉన్నారు. తాజాగా శాండల్ వుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శివణ్ (89) గుండెపోటుతో మరణించారు. 89 ఏళ్ల శివన్ తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచినట్టు శివన్ కుమారులు వెల్లడించారు.
దర్శకుడు శివన్ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు . కాగా.. దివంగత దర్శకుడు శివన్ ఇద్దరు కుమారులు కూడా సినిమా రంగంలోనే ఉండటం విశేషం. శివన్ తెరకెక్కించిన ‘అభయమ్’ సినిమాను జాతీయ అవార్డు వరించింది. ఆయన తీసిన ఫోటోలు కూడా.. నేషనల్ జియాగ్రఫీ మరియు ఇతర ప్రముఖ దినపత్రికల్లో వచ్చేవి. దర్శకుడు శివన్ మృతిపై శాండల్ వుడ్ సినీ ప్రముఖలు పలువురు సంతాపం ప్రకటించారు.