టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం తర్వాత గీత గోవిందం చేసి.. తనలోని మరో నటుడిని ప్రేక్షకులకు రుచి చూపించారు.
ఇక ప్రస్తుతం ఈయన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే 30 మంది ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020’ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచాడు విజయ్ దేవరకొండ.
అందులోనూ వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మరే ఇతర హీరో కూడా సాధించలేకపోయిన ఘనతను రౌడీ దక్కించుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఆనందంతో తెగ ఉప్పొంగిపోతున్నారు.