అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరవైన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన నాల్గొవ చిత్రాన్ని హనుమాన్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది ప్రశాంత్ వర్మ ప్రకటించకపోయినా.. యువ హీరో తేజ సజ్జనే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది కూడా. అవును, తేజ సజ్జా హీరోగా రూపొందనున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితమే సెట్స్ మీదకు వెళ్లింది.
తేజ సజ్జపై నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇవ్వగా .. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి శివశక్తిదత్త దర్శకత్వం వహించారు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. కాగా, ప్రశాంత్ వర్మ చివరి చిత్రం జాంబీ రెడ్డిలోనూ తేజనే హీరో అన్న సంగతి తెలిసిందే.
https://twitter.com/baraju_SuperHit/status/1408279891259236354?s=20