ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు మళ్లీ యాబై వేలకు పైగా పెరిగాయి.
గత 24 గంటల్లో భారత్లో 54,069 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778 కు చేరుకుంది. అలాగే నిన్న 1,321 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,91,981 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 68,885 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,90,63,740 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 6,27,057 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నినొక్కరోజే 18,59,469 కరోనా టెస్ట్లు నిర్వహించారు అధికారులు.