ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా కేసులు నిన్న స్థిరంగా కొనసాగగా.. మరణాలు కూడా తగ్గాయి.
గత 24 గంటల్లో భారత్లో 1,32,364 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,74,350 కు చేరుకుంది. అలాగే నిన్న 2,713 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,40,702 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 2,07,071 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,65,97,655 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 16,35,993 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశవ్యాప్తంగా నిన్నొక్కరోజే 20,75,428 మందికి కరోనా పరీక్షలు చేశారు.