టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ పెళ్లి విషయంపై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంటోంది. ఆమె ఒకప్పుడు మ్యూజిక్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తో లవ్లో ఉందని రూమర్ హల్చల్ చేసింది. దీని తర్వాత టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండటం చూసి వీరిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారంటూ ప్రతి రోజూ రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సమీప బంధువు అయిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకోనుందని వార్తలు రావడంతో ఛార్మీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాను జీవితాంతం ఒంటరిగా బతుకుతానని, లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకోవడమనే పెద్ద తప్పును తాను అస్సలు చేయనని కుండ బద్దలు కొట్టింది. కాగా ఛార్మీ సోలోగా ఉండిపోవాలని ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి మాత్రం పూరీ జగన్నాథ్ కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్ గా పూరీ మ్యూజింగ్స్ లో సింగిల్ బై ఛాయిస్ పాడ్ కాస్ట్ రావడంతో ఈ అనుమానాలకు మరింత అవకాశం ఇచ్చినట్టయింది.