టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఉంటుందని ఇటీవలె అధికారికంగా ప్రకటించాడు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ రూ.10 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
అయితే రాజమౌళి, సుకుమార్తో పోలిస్తే ఈ ఫిగర్ అంత ఎక్కువేం కాదనే అంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ సినిమాకు 20కోట్లు తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ మాత్రం ఆ స్థాయిలో ఆశపడలేదట. అంతేకాదు, ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్తో చేస్తున్న సలార్కు కూడా పది కోట్లకు లోపే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట.