సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ క్రమంలో పాయల్ ఆలోచనల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కరోనాను కల్కితో పోల్చింది ఈ అందాల గుమ్మా. ప్రస్తుతం పరిణామాలు చూస్తే, కలియుగం అంతమైపోయిందని సత్యయుగం మళ్లీ వచ్చేసిందని వేదాంతం వల్లించింది పాయల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు కూడా పెట్టింది. ఈ కల్కి అవతారం కొరోనాయేనా అంటూ తన సందేహం వ్యక్తం చేసింది. మొత్తానికి తన మనసులో ఉన్న వేదాంత ధోరణిని పాయల్ బాగా వివరించింది.