శోకసంద్రంలో దిధీ…ఎందుకంటే ..?

కరోనా భూతం అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారికి నేడు చాలా మంది బలైపోతున్నారు. చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ చాలా మంది కరోనా కాటుకు కన్నుమూశారు. సినీ ప్రముఖులో చాలా మంది కరోనా పోరాడి బయటపడుతుంటే మరికొందరు ప్రాణాలు విడిచారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు..ఇలా అధికారుల దగ్గిరి నుంచి కార్యకలాపాలు సాగించే నాయకుల వరకూ కరోనా మహమ్మారికి బాధపడుతూనే ఉన్నారు.

ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ కరోనా మహమ్మారి వల్ల తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు అషీమ్ బెనర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజుల ముందే మమతా బెనర్జీ అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటువంటి తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు అషీమ్ బెనర్జీ కరోనాతో కన్నుమూయడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన కోల్‌కతాలోని హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే నేడు ఆయన పరిస్ధితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే కన్నుమూయడంతో బెంగాల్ లో ఆందోళన నెలకొంది.