ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1500 సినిమాలకు పీఆర్ఓగా పని చేయడంతో పాటు తన భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఆయన మృతిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే రాజు గారికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఆప్తుడు. అందుకే మహేష్ ఒకింత ఎక్కువ ఎమోషనల్ అవుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు గారు ఇక లేరు అన్న మాటే తాను తీసుకోలేకపోతున్నా. మేము ఇద్దరం ఎన్నో ఏళ్ల నుంచి కలిసి పని చేస్తున్నాం.
నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన ఒక జెంటిల్మెన్.. ఆయన లేని లోటు మా కుటుంబానికి, మీడియాకి తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..ఈ కష్ట కాలంలో రాజు గారి తనయుడికి తన ప్రేమ, బలం ఎప్పుడు ఉంటాయి అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.