సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటుచేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు..ఇలా చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. నిజామాబాద్కు చెందిన టిఆర్ఎస్ నాయకులు, ప్రముఖ సినీ నటి కీర్తి రెడ్డి తండ్రి కేశ్పల్లి (గడ్డం) ఆనంద్ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి మృతి చెందారు. కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి నిజామాబాద్ మాజి ఎంపి కేశ్ పల్లి గంగారెడ్డి కుమారుడు. తన తండ్రి ఎంపి గా ఉన్న సమయంలో కొన్ని రోజులు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేశారు. 2014 లో బిజెపి తరుపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో చేరారు. ఆనంద్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు. అందులో ఒకరు సినీ నటి కీర్తి రెడ్డి.