నిర్మాతగా మారనున్న యంగ్ హీరో!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు అయిన హీరో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. టాలీవుడ్కే ఇండస్ట్రీలో కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం2 వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ ఇప్పుడు నిర్మాత గా మారి రాణించాలనుకుంటున్నాడు. కాగా వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టి మూవీస్ నిర్మించబోతున్నాడు సుమంత్ అశ్విన్.

గతంలో నిర్మాతగా పలు హిట్​లు తన ఖాతాలో వేసుకున్న నిర్మాత ఎమ్మెస్​ రాజు. ఇటీవలే డర్టీ హరి చిత్రంతో దర్శకుడిగా కూడా ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు తన కొత్త చిత్రం 7 డేస్ 6 నైట్స్తో రాబోతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా తన కొడుకు సుమంత్ అశ్విన్ వ్యవహరించనున్నాడు. కాగా ఈ సినిమా పై పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్ .