కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన ఎస్ఆర్ ప్రభు ట్విట్టర్లోనే ఒక వ్యక్తి సుల్తాన్ చిత్రం తన టెలిగ్రామ్ చానల్లో పొందుపరచడం జరిగిందని పోస్ట్ చేసి చెప్పాడు. దీంతో షాక్కు గురైన నిర్మాత ఎస్ ఆర్.ప్రభు ఆ తరువాత దానికి స్పందిస్తూ, రేయ్ నా ట్విట్టర్లోకే వచ్చి నా చిత్ర పైరసీకి ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారా. ఇదిగో వస్తున్నారా అంటూ కోపం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద చర్చగా మారింది.
Adeiii…. yen comment la vanthu en padaththukke piracy promote pandra alavukku valanthutteengala???
Itho varandaaa….??? https://t.co/UogtsCBBBY
— SR Prabhu (@prabhu_sr) April 4, 2021