టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త ఏమి కాదు. ఆయన చిత్రాలే కాకుండా అటు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ కి ఇది వరుకు పలు రికార్డ్స్ వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. వీడియో సాంగ్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంది.
తాజాగా మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి మహేష్ కెరీర్ లో మరో 100 మిలియన్ వీడియోగా నిలిచింది. ఈ సాంగ్లో మహేష్, రష్మికల పర్ఫార్మెన్స్ కూడా ఈ సాంగ్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం అని చెప్పచ్చు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.