వాయిదా ప‌డ్డ మహేష్ సినిమా రెండో షెడ్యూల్..!?‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేశ్‌బాబు అభిమానులకు ఒక చేదు వార్త. ఆయ‌న సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో సర్కారు వారి పాట సినిమాని చేస్తున్నారు.ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ప్రిన్స్. కానీ ఆయన ప్లాన్‌కి ప్రస్తుతం బ్రేక్ ప‌డింది.

ఇప్పటికే మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జ‌రిపేందుకు టీం సిద్ధం అవుతోంది. కాగా మూవీ షూటింగ్ కూడా దుబాయ్ లో ప్లాన్ చేశార‌ని సమాచారం. అక్కడి ఎడారిలో ఓ ఫైట్ సీక్వెన్స్ కు ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం దుబాయ్‌లో కొవిడ్ కేసులు బాగా ఎక్కువుగా న‌మోద‌వ‌డంతో ఈ షెడ్యూల్‌ను కాస్తా హైదరాబాద్‌లోనే చేద్దామ‌ని ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ అవ్వటంతో రెండో షెడ్యూల్ ను ప్ర‌స్తుతానికి వాయిదా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.