ప్ర‌కృతి ఒడిలో సేద తీరుతున్న‌ కీర్తి సురేష్..ఫొటోలు వైర‌ల్!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో అడుగు పెట్టిన కీర్తి.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. త‌న‌దైన‌ నటనతో సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్న‌ ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది.

 Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో కీర్తి ప్రస్తుతం  మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తోంది. Photo : Instagram

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర‌స‌న `స‌ర్కారు వాటి పాట‌` సినిమా చేస్తున్న కీర్తి..తమిళంలో అన్నాత్తే, మలయాళంలో భరత్ అనే సినిమాలో న‌టిస్తోంది. అంతే కాకుండా మరో లేడీ ఓరియెంటెడ్ గుడ్ లక్ సఖి సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 కీర్తి సురేష్ ఫోటోస్ Photo: Instagram

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే కీర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు తన‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా కూడా కొన్ని ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌కృతి ఒడితో సేద తీరుతూ ఎంతో అందంగా కీర్తి ఈ ఫొటోల్లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CN-FhCVpc0m/?utm_source=ig_web_copy_link