మే 1 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ నటి..!

బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. త‌న మూవీస్ విష‌యాల‌తో పాటు ఫొటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్ ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది జాన్వీ క‌పూర్. ఎప్పుడు తన అభిమానుల‌లో ప‌లు విష‌యాల‌ పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది జాన్వీ. బుధ‌వారం సాయంత్రం 18 ఏళ్లు పైబ‌డిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభం కాగా, దీని పై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేసింది జాన్వీ.

జాన్వీ క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేస్తూ, 18 సంవ‌త్స‌రరాల వ‌య‌స్సు లేదా అంత క‌న్నా ఎక్కువ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం న‌మోదు చేసుకోవాల‌ని ఆమె కోరింది. మే 1 కోసం తాను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు రిజిస్ట‌ర్ చేయించుకోవాల‌ని చెప్పింది జాన్వీ. ప్ర‌స్తుతం ఈ భామ బ్ర‌హ్మాస్త్రా మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తుంది.