భవిష్యత్ రోజుల్లో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయగా, కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్లో నటించింది. రీసెంట్గా తమన్నా 11 అవర్ అనే వెబ్ సిరీస్తో వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా రుద్ర అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అనే క్రైమ్ డ్రామా సిరీస్ 2021లోనే డిస్నీ+హాట్ స్టార్ విఐపిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఐకానిక్ కాప్గా అజయ్ కనిపించి అలరించనున్నారు. రుద్ర సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అజయ్ దేవగణ్ అన్నారు. కాగా, అజయ్ దేవగన్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, ఆయన లుక్ అభిమానులని బాగా ఆకట్టుకుంది.