ఏపీ సీఎం చంద్రబాబుపై ఆంగ్ల పత్రిక ఎకనమిక్ టైమ్స్ బాంబు పేల్చింది. న్యాయ వ్యవస్థపై బాబు పెత్తనం చేస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండరని భావించే కొందరు న్యాయవాదులకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఈ కథనం సారాంశం. నిజంగా ఈ కథనం నిజమైతే.. బాబు తీవ్ర చిక్కుల్లో పడ్డట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. దేశంలోని అన్ని హైకోర్టులకు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్రపతి ఆమోదంతో ఆయా గవర్నర్లు.. ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగిస్తారు.
ఇక, ఏపీ, తెలంగాణల ఉమ్మడి హైకోర్టులోనూ నియామకాలకు సంబంధించి 2016 ఏప్రిల్ 30న అప్పటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోస్లే ఆరుగురు న్యాయవాదుల పేర్లను జడ్జీలుగా సిఫారసు చేశారు. దీనిపై సీఎంల అభిప్రాయం కోరగా.. తెలంగాణ సీఎం నెల రోజుల్లోనే తన అభిప్రాయం తెలపగా.. ఏపీ సీఎం మాత్రం 11 నెలల తర్వాత స్పందించారు. మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖలో జడ్జీలుగా సిఫారసు చేసిన ఆరుగురిలో ఐదుగురు జడ్జీలకు బంధువులు.. జూనియర్లుగా ఉన్నారని కాబట్టి.. వారిని సిఫారు చేయొద్దని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు బాబు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మార్చి 21న లేఖ రాశారు.
ఏపీకే చెందిన మరో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. ఈ ఏడాది మార్చి 28న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహార్కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఈయన కూడా బాబు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వెల్లడించారు. ఆ ఐదుగురికి బంధువులు జూనియర్లుగా ఉన్నారని తెలిపారు. అయితే, దీనిపై స్పందించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్.
ఏపీ సీఎం చంద్రబాబుతో.. జస్టిస్ ఎన్వీ రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, హైకోర్టుకు సిఫారసు చేసిన ఆ రుగురు న్యాయవాదుల విషయంలో సీఎం చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలు.. జస్టిస్ రమణ అభిప్రాయాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు.
నిజానికి బాబు చెప్పినట్టు.. బంధువులు జూనియర్లుగా ఉన్నట్టు ఏ మాత్రం ఆధారాలు లేవని, ఇలాంటి ఆరోపణలు చెల్లుబాటు కావని.. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కొలిజీయం వ్యవస్థ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ చలమేశ్వర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టు కూడా ఈ ఆరోపణలను నిర్దారించటం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయంతో ఏకీభవించి వారి పేర్లను జడ్జిలకు సిఫారసు చేసింది. ఇప్పుడు ఈ కథనం న్యాయ వ్యవస్థపై బాబు అజమాయిషీని వెల్లడిస్తోందని, ఇది ప్రమాదకర పోకడలకు నిదర్శనమని కథనం వివరించింది.