ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో కడప గడపలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ హోరా హోరీగా తలపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా? అన్న రీతిలో శిబిరాలు నిర్వహిస్తున్నాయి. వరుస చర్చోపచర్చలు.. అధినేతల సూచనలు.. వ్యూహప్రతివ్యూహాలు.. ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తలమునకలవుతున్నారు ! అస్థిత్వాన్ని కాపాడుకేనే ప్రయత్నం ఒకరిదైతే.. ఎలాగైనా వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టాలనే ప్రయత్నం వేరొకరిది!! మరి ఈ ప్రయత్నంలో గెలిచేదెవరు? కడప రాజకీయంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట! ఇప్పుడు ఈ కోటపై సీఎం చంద్రబాబు […]