మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]