దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే ఆయన కరోనా టెస్ట్స్ చేయించుకోగా, కరోనా పరీక్షలో ఆయనకి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు స్వయంగా తెలిపారు. వైరస్ లక్షణాలు తనలో కనిపించడంతో తాను కోవిద్ పరీక్షలు చేయించుకున్నానని, దాని రిపోర్ట్ పాజిటివ్గా వచ్చినట్లు ఆదిత్యనాథ్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. […]