భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అదరగొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లో సింధు ఘనవిజయం సాధించి శభాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. సెమీస్లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్కడా తడబాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజయంతో […]