ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]