కిషన్‌తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!

మొత్తానికి తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్‌ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బి‌జే‌పి గెలిచింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పినే ప్రత్యామ్నాయం […]