మొద‌లైన `స‌ర్కారు వారి పాట‌` షూట్‌..వైర‌ల్‌గా లొకేష‌న్ స్టిల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. మ‌ళ్లీ తాజాగా మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్‌లో ఈ చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ […]