వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా పొత్తులతో పాటు ప్రజాసంఘాల మద్దతు కూడా ఓ వైపు కూడగడుతోంది. మరోవైపు పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాదరణ లేని సీనయర్లను పక్కనబెట్టి యువనేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువమంత్రంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ స్థానంలో ఈ సారి విజయభేరీ మోగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ సారి అసెంబ్లీ పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రముఖ రాజకీయ కుటుంబాలు పోటీకి […]