రాజకీయాలన్నాక నేతలు అలగడం, వారిని అధిష్టానం బుజ్జగించడం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో తనమాటకు విలువ లేకుండా పోయిందని, తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేదని సమాచారం. మరి అంతగా ఆయన అలగడానికి […]