పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్ కింద బీహార్ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్ తనకు వద్దని, బీహార్ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. […]