జేఈఈ మెయిన్ పరీక్ష పై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఐఐటీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. […]