తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ […]