విజయ్ సాయి‌రెడ్డికి నోటీసులు…?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ విజయ్ సాయి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టు విజయ్ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై ఎంపీ విజయ్ సాయి ఇంకా స్పందించలేదు. […]