నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు

దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో మొద‌లైన సెగ‌లు.. ఇంకా చ‌ల్లార‌డం లేదు. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య వివాదం స‌మ‌సిపోగా.. ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంలో ఇంకా సందిగ్ధం వీడ‌లేదు. దీంతో నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వ‌ద్దా అనే మీమాంస‌లో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డికి అధిష్టానం వ‌రుస‌గా షాకులు ఇస్తోంది. […]