సోము వీర్రాజు! ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్రపక్షం నేత. టీడీపీ-బీజేపీల మిత్రపక్షాలే అయినప్పటికీ.. సోము ఆవేశం, ఆవేదన మాత్రం.. విపక్షం మాదిరిగానే ఉంటోంది. తమను టీడీపీ అధినేత కరివేపాకులా చూస్తున్నారని, తమకు విలువ లేదని, ఆయనకు చెక్కభజన చేసేవాళ్లనే పట్టించుకుంటున్నాడని పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సోము.. అసలు టీడీపీతో బంధం వద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖలు రాసి, కార్యకర్తలతో ప్రదర్శనలు సైతం ఇప్పించాడు. దీనికి కారణం పైన చెప్పుకొన్నట్టు.. టీడీపీ […]
Category: Politics
ఏపీలో మరో స్విస్ ఛాలెంజ్… నయా దోపిడీ చూస్తే షాకే..!
స్విస్ ఛాలెంజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఏపీ రాజధాని నిర్మాణాలకు సంబంధించి కొన్ని నెలల కిందట పెద్ద దుమారం రేపిన సంస్థ ఇది. రాజధాని మాస్టర్ ప్లాన్ అంటూ హడావుడి చేసిన ఈ సంస్థకు కాంట్రాక్టులు అప్పగించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ కాంట్రాక్టు సంస్థ పెట్టిన షరతులు, నిబంధనలు ఏపీ రాష్ట్రం మెడకు ఉచ్చుగా తగులుకుంటాయని తెలియడం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. […]
ఎంపీ బరిలో షర్మిల… మూడు ఆప్షన్లు రెడీ..!
వైసీపీ అధినేత వైఎస్.జగన్ సోదరి షర్మిలకు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలన్న కోరిక ఎట్టకేలకు వచ్చే ఎన్నికల్లో తీరనుంది. వాస్తవానికి 2014 ఎన్నికల బరిలోకి దిగాలని ఎంతో ఉవ్విళ్లూరిన ఆమె ఆశలను జగన్ వమ్ము చేశారు. సమీకరణలు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో గత ఎన్నికల్లో షర్మిలను జగన్ పక్కన పెట్టక తప్పలేదు. గత ఎన్నికల్లో జగన్ కజిన్ అవినాష్రెడ్డికి కడప ఎంపీ సీటు ఇచ్చిన జగన్, తల్లి విజయలక్ష్మిని విశాఖ నుంచి బరిలోకి దింపారు. చివరి క్షణంలో […]
యనమల, రాజప్పకు బాబు వద్ద ప్రయారిటీ తగ్గుతోందా…. ఇదే నిదర్శనం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాకినాడ మేయర్ ఎంపికలో అదే జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు యనమల రామకృష్ణుడుకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగానే మేయర్ పీఠాన్ని కాపులకు ఇస్తామని చెప్పడంతో ఈ వర్గంలో గెలిచిన నలుగురు మహిళలు పోటీపడ్డారు. సుంకర లక్ష్మీప్రసన్న, సుంకర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వరలక్ష్మి పోటీపడ్డారు. వీరి నలుగురికి […]
చంద్రబాబుపై అప్పటి పగ తీర్చుకుంటోన్న పురందేశ్వరి
అవును. ఇప్పుడు బీజేపీ వర్గాల్లో ఇదే టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో టికెట్ గురించి చిన్నమ్మ ఓ శపథం పట్టిందని, సీఎం చంద్రాబుపై పైచేయి సాధించేలా తన పంతం నెగ్గించుకోవాలని నిర్ణయించుకుందని అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో తనకు బాబు చేతిలో జరిగిన అవమానానికి రెట్టింపు ప్రతీకారం తీర్చేయాలని ఆమె డిసైడ్ అయ్యారని అంటున్నారు. రాజకీయంగా తనను తాను నిరూపించుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరి ఈ శపథం ఏమిటో? పురందేశ్వరి పంతం […]
లగడపాటి టీడీపీ ఎంట్రీ..ఆ ఇద్దరిలో ఎవరికి ఎర్త్..!
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పేరు మళ్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఆ మాటకు ఇన్నాళ్లూ కట్టుబడి ఉన్నారు. అయితే మళ్లీ ఆయన రాజకీయా ల్లోకి రావాలనే ఒత్తిడి ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ, ఇతర రాజకీయ పరిణామాల తరుణంలో.. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరితే.. ఎవరికి ఎర్త్ పెడతారు అనే […]
జనసేన మూడేళ్ల ప్రస్థానం.. సాధించింది ఏమిటి?
ఏదైనా ఒక పార్టీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని అనుకున్నప్పడు అనుసరించాల్సిన వ్యూహాలు సపరేట్గా ఉంటాయి. అదేవిధంగా కొత్తగా మొగ్గతొడిగిన పార్టీ అయితే, విచ్చుకుని సుగంధాలు విరజిమ్మేందుకు ప్రయత్నాలు సాగాలి. కానీ, మూడేళ్ల కిందట 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మొగ్గవిచ్చిన జనసేన పరిస్థితి చూస్తే.. ఇంకా పుంజుకోలేదేమోనని అనిపిస్తోంది. నిన్నటికి నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్లో స్పందించారు. పార్టీని స్థాపించిన ప్పుడు తాను ఒక్కడినేని, ఇప్పుడు మాత్రం 20 లక్షల మంది ఉన్నారని […]
లోకేష్ దగ్గర నేతల ఫీట్లు స్టార్ట్!
2019 ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయినా కూడా ఏపీలో అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే ఎన్నికల వేడిలో మగ్గిపోతున్నాయి. వివిధ కార్యక్రమాలతో వైసీపీ తన అజెండా ప్రకటించింది. మిస్ఢ్ కాల్, వైయస్సార్ కుటుంబం, నవరత్నాలు వంటి పథకాలతో ముందుకు పోయేందుకు కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే మిస్డ్ కాల్ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా ప్రారంభించింది. అదే సమయంలో అధికార పక్షం టీడీపీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇంటింటికీ టీడీపీ- పేరుతో ఇప్పటికే అధికార […]
వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన చిచ్చు!
నంద్యాల.. కాకినాడ ఫలితాలతో డీలాపడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గురుశిష్యుల పోరు పెద్ద తల నొప్పిగా మారింది. వీరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మధ్య టికెట్ పోరు అధికమవుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉండగా.. మరి కొన్ని చోట్ల ఇది భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం గురుశిష్యులిద్దరూ ఇప్పటినుంచే పోటీపడు తున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సాక్షిగా బలనిరూపణకు […]