ఏపీ మంత్రికి గుబులు పుట్టిస్తున్న మావోల లేఖ‌

ఏపీ మంత్రుల‌కు మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మైనింగ్ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న వారి కొడుకుల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేయ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఏవోబీలో మావోయిస్టుల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్న త‌రుణంలో.. ఏపీ మంత్రి త‌న‌యుడిని హెచ్చరిస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌తంలో మంత్రికి కూడా హెచ్చ‌రిస్తూ లేఖ రాసిన మావోయిస్టులు.. ఇప్పుడు త‌న‌యుడిని బెదిరిస్తూ లేఖ రాయడం గుబులు పుట్టిస్తోంది. ఏపీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి త‌న‌యుడు […]

తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా క‌ప్పుల త‌క్కెడ‌లో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. వ‌రుస‌గా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జ‌న‌సేన […]

కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన […]

పోటీపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన బాలయ్య

కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఓ ఇష్యూపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నార‌న్న‌దే ఆ వార్త. బాల‌య్య‌కు హిందూపురంలో ఇటీవ‌ల బాగా వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో హిందూపురంకు బ‌దులుగా కృష్ణా జిల్లాలోని గుడివాడ లేదా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారని మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బాల‌య్య ఎట్ట‌కేల‌కు క్లారిటీ […]

జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే […]

టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ తెలంగాణ‌లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. త‌మ్ముళ్లూ.. ! అంటూ భ‌రోసా నింపిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో తెలంగాణ టీడీపీ నేత‌ల ముఖం చూడ‌లేదు. ఒక ర‌కంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు వంటి వాటిలో తీరుబ‌డి లేకుండా ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేత‌ల‌తో వారాల త‌ర‌బ‌డి చ‌ర్చించి.. […]

బాబుకు వాస్తు పిచ్చి.. పార్టీ ఆఫీస్‌కి వెళ్ల‌డం మానేశారు!

ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రూ దూరం చేసుకోరు. క‌నీసం నెల‌కోసారైనా వాళ్ల‌ను ప‌ల‌క‌రించి, ప‌రిస్థితిపై వాక‌బు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్టుగా ఉంటున్నార‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లో టీడీపీని రెండుగా విభ‌జించారు. ఎక్క‌డిక‌క్క‌డ బ‌లోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు […]

కాపు నేత‌తోనే ముద్ర‌గ‌డ‌కు చెక్‌

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి క‌దం తొక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. చ‌లో అమ‌రావ‌తి అంటూ.. ప్ర‌భుత్వంపై శ‌మ‌ర శంఖం పూరించేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలోలా తమ ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు ప్ర‌య‌త్నించినా.. ఈసారి మాత్రం వెన‌క‌డుగు వేసేది లేద‌ని బ‌ల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌న్నింటినీ ఆదిలోనే తొక్కేసిన సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు కూడా అదే ప‌నిలో ప‌డ్డారు. ఈసారి కూడా ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌నే దృఢనిశ్చ‌యంతో ఉన్నారు. కాపు నేతల‌కు స‌మాధానాలిచ్చేందుకు ఆ సామాజిక వ‌ర్గానికి […]

మోడీ ప్ర‌స‌న్న కోసం వెంక‌య్య ఏదైనా చేస్తాడా..!

ప్ర‌ధాని మోడీ ప‌ర‌మ వీర విధేయులైన భ‌క్తుల్లో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయ‌న మెప్పు పొంద‌డానికి నిరంతరం, అహ‌ర్నిశ‌లు, ప‌గలురాత్రి అన్న తేడా లేకుండా శ్ర‌మిస్తూ ఉంటారు. సంద‌ర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి వ‌చ్చి దైవ‌దూత‌గా అభివ‌ర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తృణ‌ప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మ‌రోసారి ప్ర‌వేశ‌పెట్టే య‌త్నాల‌కు వెంక‌య్య జ‌త‌క‌లిశారు. మోడీని హీరో చేయ‌డం కోసం సొంత భాష‌ను గుజ‌రాత్ […]