ఇప్పటికే తిరుమల అలిపిరి మార్గంలో ఎంతోమందిపై చిరుత దాడి చేసి గాయాల పాలైన సంఘటనలు మనం చూసాం. గతంలో కూడా అలిపిరి నడక మార్గంలో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సిబ్బంది సాయంతో ఆ బాబుని కాపాడారు. ఇక తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై అలిపిరి నడక మార్గంలో చిరుత మరో సారి దాడి చేసింది.
తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి గుడికి రాత్రి 11 గంటలకు ఆ పాప వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు వెనకాల నడుస్తూ ఉండగా పాప కాస్త ముందు నడుస్తుంది. అదే టైంలో చిరుత ఆ పాపపై దాడి చేసింది అర్ధరాత్రి కావడంతో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. తెల్లవారుజామున చిన్నారి కోసం గాలింపులు మొదలుపెట్టిన సిబ్బంది చిన్నారి మృతదేహానికి గుర్తించారు.
అప్పటికే చిరుత ఆ చినరిని చంపి సగం మృతదేహాన్ని తినేసి వెళ్లిపోయింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గతంలో ఆ బాలుడు పై చిరుత దాడి చేసినప్పుడే తిరుమల సిబంధి భద్రత చర్యలు తీసుకొని ఉంటే ఇలంటి సంఘటన జరిగి ఉండేది కాదు అంటూ తిరుమల భద్రతా సిబ్బంది పై ఫైర్ అవుతున్నారు జనం.