సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే అతి పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. వీరి విడాకుల విషయం పై ప్రేక్షకులు, సినీ అభిమానులు, సెలబ్రిటీలతో పాటు ఇతర రాష్ట్రాల సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే అందాలతార ఖుష్బు కూడా చైతన్య – సమంత విడాకుల వ్యవహారం పై స్పందించింది.. అంతేకాదు ప్రస్తుతం ఆమె తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఖుష్బూ ట్వీట్ ద్వారా.. నాగచైతన్య – సమంత మధ్య ఏం జరుగుతోంది.. వీరి మధ్య అసలు ఏముంది.. వీరు విడిపోవడానికి గల అసలు కారణం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు..కేవలం ఈ ఇద్దరికీ తప్ప.. మనుషులుగా మనం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం వారి గొప్యతను గౌరవించడం అలాగే వీరు తమ పరిస్థితిని మరింత అర్థం చేసుకోవడానికి కావలసినంత ప్రైవసీని ఇవ్వడం.. ఇక ఊహించడం.. ఊహాగానాలు చేయడం లేదా నిర్ధారణకు రావడం వంటివి ఆపేయండి.. అంటూ ట్వీట్ చేస్తూ చివర్లో ముడుచుకున్న చేతులు ఉన్న ఈమోజిని ఆమె జోడించి ట్వీట్ చేయడం జరిగింది..
దీన్ని బట్టి చూస్తే ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు అంటే విడిపోవడానికి గల కారణం కేవలం వారికి మాత్రమే తెలుసు అని ఆమె చెప్పింది.
What happens between a couple,is between them. Nobody knows the actual reason why they part ways, except the two of them. What we can do as human is to respect their privacy n give them space to understand the situation more. Stop assuming, speculating n coming to conclusions. 🙏
— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) October 2, 2021