టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్కు సిద్ధమైంది. ఏళ్ళ తరబడి నిరీక్షణ తర్వాత జూన్ 12న ఆడియన్స్ను పలకరించేందుకు ఈ సినిమా సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం రిలీజ్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా.. తాజాగా రీ రికార్డింగ్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో సరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఆఫీసుకు చేరుకున్న ప్రొడ్యూసర్.. ఏ.ఎం.రత్నం అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. హై బీపీ తో ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్లు సమాచారం.
వెంటనే ఇది గమనించిన ఆఫీస్ సిబ్బంది.. పక్కనే ఉన్న ఒమేగా హాస్పిటల్ కు తరలించగా.. అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆయనను కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ చేశారట వైద్యులు. తగిన జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ షెడ్యూల్ టెన్షన్ కారణంగా నిర్మాత అస్వస్థతకు గురయ్యాడట. ఇక పవన్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన డబ్బింగ్ పనులను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు గంటల్లో ఆయన డబ్బింగ్ పనులు పూర్తి చేశారని మూవీ టీం అఫీషియల్గా పేర్కొన్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో.. వీర యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, నౌరా ఫతేహి తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో.. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్.. సక్సెస్ అందుకుంటే మాత్రం సెకండ్ పార్ట్ పై ఆడియనప్స్లో మరింత హైప్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.