ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంత ఇంపార్టెంట్ గా మారిపోయారు. హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే సినిమాల విషయంలో హీరో – హీరోయిన్స్ పై డైరెక్టర్ ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడో కూడా మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు .
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ తో కమిట్ అయిన సినిమాను ఇప్పుడు సెట్స్ పైకి తీసుకురావడానికి అఫీషియల్ నోట్ ఇచ్చాడు . ఈ సినిమాను ఆగస్టు 2024వ సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..?? అంటూ లేటెస్ట్ బజ్ నెలకొంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ కీయర అద్వానీ నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది.
కియరా అనగానే అందరికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తొస్తాడు . తెలుగులో కీయరా అద్వానీ అంటే ఆమె పేరు పక్కన చరణ్ పేరు ఉండాల్సిందే .అంతలా పాపులారిటీ సంపాదించుకుంది ఈ జంట. వినయ విధేయ రామ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ కీయరా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు . రామ్ చరణ్ ఎలాంటి హిట్ అయితే కీయరా అద్వానికి ఇవ్వాలి అనుకుంటున్నాడో అలాంటి హిట్ ఎన్టీఆర్ కూడా ఇస్తాడు అంటూ ఓ రేంజ్ లో నందమూరి ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు..!!