చదువు పూర్తయిపోగానే లక్ష రూపాయల ప్యాకేజీ తో ఉద్యోగాన్ని సరిపెట్టుకోకుండా సొంతంగా పరిశ్రమను పెట్టి రెట్టింపు స్థాయికి ఎదగాలని అంత భావిస్తున్నారు. కొత్త పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పరిశ్రమిక రంగం అండగా నిలుస్తుంది. దాంతో ప్రపంచంలో స్టార్ట్ అప్ అనుకూల వాతావరణ ఉన్న దేశాల్లో మన దేశం మూడో స్థానాల్లో నిలిచింది. ఇక్కడ దాదాపు లక్ష 16 వేల గుర్తింపు పొందిన స్ప్రౌట్ పరిశ్రమల నిలిచాయి. 56 వైవిద్య విభాగాలుగా.. రకరకాల సమస్యలు పరిష్కారాలను సూచిస్తున్నాయి.
ప్రత్యేకించి టెక్స్టటంలో అమెరికా, చెన్నై తర్వాత మూడో స్థానంలో మనదేశమే ఉంది. నాసా స్కామ్ నివేదిక ప్రకారం 27 వేల దాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్స్టాప్స్ ఈ దేశంలోనే ఉన్నాయి. ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి రావడం.. పెట్టుబడిదారులుగా మారి లాభాలను అర్జించాలని అనుకుంటున్నారు. ఇంక్యూబేటర్లు అందుబాటులోకి కూడా వస్తున్నాయి. పలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందని పలు కంపెనీల్లో సెలబ్రిటీలు కూడా ముందుచూపుతో కోట్లలో ఇన్వెస్ట్ చేసి గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్లుగా ఎదిగి వారికి కూడా అదే బాటలో నడిపిస్తున్నాయి.
శిఖర్ధావన్: అప్స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2021లో ఇన్వెస్ట్ చేశారు.
సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో ఇన్వెస్ట్ చేశారు.
శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీలో నవంబర్ 2021లో ఇన్వెస్ట్ చేశారు.
విరాట్కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 2021లో ఇన్వెస్ట్ చేశారు.
అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్ఫామ్ వద్ద జనవరి 2021లో ఇన్వెస్ట్ చేశారు.
ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్లో నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు.