యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ గాడ్ మూవీ ” హను మాన్”. ఎన్నో అంచనారు నెలకొన్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలలో నటిస్తుండగా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీపై తేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నేలకున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. హనుమాన్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి ఏడున ప్లాన్ చేస్తున్నట్లు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తెలిపాడు ప్రశాంత్ వర్మ.
ఇక ఇటీవల చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ లను కలిశానని.. వారు తమ నుంచి మా సినిమా కోసం ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తారన్నారని తెలిపారు. అయితే వీరిలో ఎవ్వరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నారా అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నించగా.. అది ఇప్పుడప్పుడే చెప్పలేమని.. వారిలో ఎవ్వరు వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఇక వీరి మాటలు బట్టి చూస్తే.. ఈ ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో ఎవ్వరైనా రావచ్చని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.