ప్రభాస్ హీరోగా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తేనున్నాడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా శృతిహాసన్ తో పాటుగా ఇంకో హీరోయిన్ ట్రైలర్లో కనబడింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?… ఆమె పేరు శ్రియ రెడ్డి. ఈమె ముందు యాంకర్ గా.. మీడియో జాకీగా పనిచేసి అనంతరం సినిమాల్లోకి వచ్చింది. ఇక తమిళ్లో సినిమాలు చేస్తూ ప్రస్తుతం దూసుకుపోతుంది.
ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయమే. తెలుగులో 2003 లో వచ్చిన అప్పుడప్పుడు సినిమాలో నటించిన ఈమె… 2006లో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది. ఇక రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది. ఈమె టాలీవుడ్ స్టార్ హీరో అయిన విశాల్ కు వదిన అవుతుంది. ఈ బ్యూటీ విశాల్ కు వదిన అవుతుంది అని పెద్దగా ఎవరికి తెలియదు. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ పృథ్వీరాజ్ సుకుమారన్ కి భార్యగా నటించనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.