సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అయితే కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచుల్లుని వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ భారతీయుడు 2, భగవంత్ కేసరి సినిమాలలో నటించింది. భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాజల్ ఇటీవల నటించిన సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా పూజా హెగ్డే ఫోన్ చేసి మరి క్షమాపణలు అడిగిందంటూ.. టాక్. ఆచార్య టైంలో వీళ్ళిద్దరి మధ్యన ఏవో డిఫరెన్స్ వచ్చాయని.. అప్పటివరకు బాగా ఉన్న పూజ, కాజల్ అ తరువాత నుంచి మాట్లాడుకోవడమే మానేసారని తెలుస్తుంది. అయితే కాజల్ ఆ గొడవలు మర్చిపోయి తన పనిలో తను వరుస సినిమాలు నటిస్తూ బిజీ అయిపోయింది. కాగా పూజకు ఇటీవల సినిమా అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే పూజ ఆఫర్లు తగ్గిపోయాయి మళ్ళీ తన తప్పు తెలుసుకుని పూజా.. కాజల్ కి కాల్ చేసి మరి క్షమాపణలు అడిగిందట.
పూజ హెగ్డే ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్న తరువాతనే కాజల్ని ఈ సినిమా నుంచి హీరోయిన్గా తప్పించారట కొరటాల. కాజల్ – చిరంజీవి జోడిగా ఈ సినిమా నటించాల్సి ఉండగా.. ఏవో కారణాలతో ఆమెను తీసేసాడు. ఈ విషయం పూజకి తెలుసు అయితే కాజల్ కాల్ చేసి అడిగిన పూజ నాకు తెలియదు అంటూ డబల్ గేమ్ ఆడిందట. ఆ విషయం తెలుసుకున్న కాజల్ పూజను దూరం పెట్టిందని.. తప్పు తెలుసుకున్న పూజ మళ్ళీ కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పి ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేస్తోందని సమాచారం.